యూఏఈ-ఇండియా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొత్త నిబంధనలు
- November 21, 2022
యూఏఈ: యూఏఈతో పాటు ఇతర దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తమ పాస్పోర్ట్లలో వారి ప్రాథమిక (మొదటి పేరు), ద్వితీయ (ఇంటిపేరు) పేర్లు ఉండేలా చూసుకోవాలని Air India Express ప్రకటించింది. ఈ మేరకు యూఏఈలోని అన్ని ట్రావెల్ ఏజెంట్లకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎయిర్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇంటి పేరు లేదా ఇచ్చిన పేరుతో ఒకే పేరు (పదం) ఉన్న ఏదైనా పాస్పోర్ట్ హోల్డర్ను యూఏఈ ఇమ్మిగ్రేషన్ విభాగం అంగీకరించదు. అలాంటి ప్రయాణీకులను INAD (ప్రయాణానికి అనుమతి లేదు)గా పరిగణిస్తుంది. కొత్త మార్గదర్శకాలు నవంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఉదాహరణకు పాస్పోర్ట్లో ఏదైనా ప్రయాణీకుడి పేరు ఇంటిపేరుతో (ఖాళీ) లేదా అతని/ఆమె ఇచ్చిన పేరు ప్రవీణ్ గా పేర్కొంటే.. ఇంటిపేరుతను (ఖాళీగా) వదిలితే అటువంటి పాస్పోర్టులను యూఏఈ ఇమ్మిగ్రేషన్ అంగీకరించదు. వీసా గతంలో జారీ చేసినా అతను/ఆమె ఇమ్మిగ్రేషన్ ద్వారా INAD అవుతాడని ఎయిర్ ఇండియా పేర్కొంది. టూరిస్ట్ లేదా విజిట్ వీసాపై ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని.. నివాసం లేదా ఉపాధి వీసాలను కొత్త నిబంధన నుంచి మినహాయించాలని సర్క్యులర్ లో ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







