ఇంగ్లండ్తో మ్యాచ్.. ఇరాన్ వినూత్న నిరసన!
- November 21, 2022
దోహా: ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. హిజాబ్కు వ్యతిరేకంగా ఇరాన్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.
కొన్ని వారాల క్రితం హిజాబ్ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి, మృతి చెందినప్పటి నుంచి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు.
ఆట జరుగుతున్న ఖలీఫా అంతర్జాతీయ మైదానంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన సమయంలో ఆ దేశానికి చెందిన 11 మంది ఆటగాళ్లూ మౌనంగా ఉండిపోయారు. తమ జట్టు సభ్యులం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ కెప్టెన్ అలీరెజా జహంబఖష్ చెప్పాడు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







