గల్ఫ్ ప్రాంతంలో వేలాది కంప్యూటర్లకు సోకిన రష్యన్ వైరస్
- November 23, 2022
యూఏఈ: ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల్లో రష్యన్ స్కామర్లచే సౌదీ అరేబియా, గల్ఫ్ అంతటా వేలాది కంప్యూటర్లు హ్యాక్ చేయబడ్డాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ గ్రూప్-ఐబి వెలువరించిన నివేదికను వెల్లడించింది. అమెజాన్, పేపాల్తో సహా ఖాతాల కోసం ఉపయోగించే పాస్వర్డ్లను, కార్డుల చెల్లింపు రికార్డులు, క్రిప్టో వాలెట్ల వివరాలను మాల్వేర్ను ఉపయోగించి హ్యాకర్లు సేకరించారిన తెలిపింది. దాదాపు 6,300 ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా 700,000 కంటే ఎక్కువ పాస్వర్డ్లను స్కామర్లు దొంగిలించారని నివేదిక పేర్కొంది. సౌదీ అరేబియా నుండి కేవలం 1,400 మంది వ్యక్తుల నుండి క్రెడిట్ కార్డ్ వివరాలను సేకరించినట్లు సైబర్ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది. స్కామర్లు ఇమెయిల్ సేవలు, సోషల్ మీడియా ఖాతాల వంటి వ్యక్తుల ఇంటర్నెట్ బ్రౌజర్లలో నిల్వ చేయబడిన సమాచారాన్ని సేకరించగలిగే మాల్వేర్ను ఉపయోగించాయని పేర్కొన్నారు. హ్యాకర్లు బ్యాంక్ వివరాల వంటి సమాచారాన్ని పొందినప్పుడు, వారు డబ్బు, డేటాను దొంగిలించడానికి లేదా దొంగిలించబడిన సమాచారాన్ని "సైబర్క్రిమినల్ అండర్గ్రౌండ్"లో విక్రయించడానికి ఉపయోగిస్తారని నివేదికలో తెలిపారు. ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి డబ్బును దొంగిలించే ప్రయత్నంలో సైబర్ నేరగాళ్లు సౌదీ అరేబియాలోని "ప్రముఖ" రిక్రూట్మెంట్ సంస్థ వలె నటించారని నవంబర్లో గ్రూప్-ఐబి వెల్లడించింది. ఫేస్బుక్ వంటి సైట్లలో వెబ్సైట్ కోసం ప్రకటనల ద్వారా దేశీయ సిబ్బంది కోసం వెతుకుతున్న వ్యక్తులను ఆకర్షించడానికి స్కామర్లు సౌదీ కంపెనీ వెబ్సైట్ల 1,000 కంటే ఎక్కువ నకిలీ వెర్షన్లను సృష్టించారని సైబర్ సెక్యూరిటీ సంస్థ నివేదిక వెల్లడించింది. 2012లో ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్టాక్లలో ఒకటైన చమురు దిగ్గజం అరమ్కోను హ్యాకింగ్ చేయడంతో సౌదీ అరేబియా ప్రముఖంగా సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారిందన్నారు. కటింగ్ స్వోర్డ్ ఆఫ్ జస్టిస్ అనే బృందానికి చెందిన హ్యాకర్లు చమురు, గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసే లక్ష్యంతో సుమారు 30,000 కంప్యూటర్లను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









