పొగాకు అమ్మిన ముగ్గురికి RO3,000 జరిమానా
- November 23, 2022
మస్కట్: సౌత్ బతినా గవర్నరేట్లోని బార్కా విలాయత్లో నమిలే పొగాకు వ్యాపారం చేసినందుకు ముగ్గురు ప్రవాసులపై RO3,000 జరిమానాను కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) విధించింది. దక్షిణ బతినాలోని వినియోగదారుల రక్షణ విభాగం ఇటీవల వినియోగదారులకు నమిలే పొగాకు ఉత్పత్తులను విక్రయించిన ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు సీపీఏ పేర్కొంది. ఇది 256/2015 పొగాకు వ్యాపారంపై నిషేధానికి సంబంధించిన సవరణల ఉల్లంఘన కిందకు వస్తుందని అథారిటీ తెలిపింది. నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నమిలే పొగాకు స్టాక్లను ధ్వంసం చేశఆరు. అలాగే వారిపై RO3,000 పరిపాలనా జరిమానా విధించినట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం







