తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు న్యాయమూర్తులు బదిలీ..
- November 24, 2022
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీచేస్తూ కోలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు, అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
అదేవిధంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవనంద్ను మద్రాసు హైకోర్టుకు, అదే హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. వీరితో పాటు మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్టి టి. రాజును రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ వి.ఎం. వేలుమణిని కోల్కత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం న్యాయశాఖకు సిఫారసు చేసింది.

తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







