తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు న్యాయమూర్తులు బదిలీ..
- November 24, 2022హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీచేస్తూ కోలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు, అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
అదేవిధంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవనంద్ను మద్రాసు హైకోర్టుకు, అదే హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. వీరితో పాటు మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్టి టి. రాజును రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ వి.ఎం. వేలుమణిని కోల్కత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం న్యాయశాఖకు సిఫారసు చేసింది.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం