అమెరికా ప్రయాణం అంత సులభం కాదు...
- November 24, 2022అమెరికా: అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కువగా పెరిగింది.దీంతో అన్ని రకాల వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ పెరుగుతూనే ఉంది.అమెరికా వెళ్లాలనుకుంటే డబ్బులుంటే చాలదు. వెయిటింగ్ చేసేంత ఓపిక కూడా ఉండాల్సిందే. మాహా అంటే రెండు నెలలు, మూడు నెలలు అనుకుంటున్నారేమో.అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కోసం మూడేళ్లు నీరిక్షించాల్సిందే. అవును మరి.. అమెరికా పర్యాటక వీసా అపాయింట్మెంట్ కోసం దాదాపు 1000 రోజుల వెయిటింగ్ లిస్టు ఉంది. అంటే బిజినెస్, టూరిస్టు విసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే, వారికి 2025 జూన్ లేదా జులైలో విసా అపాయింట్మెంటు దొరుకుతుందన్నమాట. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారికోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్మెంట్ కోసం పట్టే సమయాన్ని, అమెరికా విదేశాంగశాఖకు చెందిన వెబ్సైట్లో పొందుపరుస్తారు. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బందిని బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్డేట్ చేస్తుంటారు.
భారత్లో ఢిల్లీ ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా కాన్సులేట్ల నుంచి వీసా జారీ సేవలు అందిస్తోంది.ముంబై ఎంబసీ నుంచి పర్యాటక వీసా బీ1, బీ2 కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం 999 రోజులు నిరీక్షించాలని అమెరికా అధికారిక వెబ్సైట్లో చూపిస్తోంది.అంటే దాదాపు 31 నెలలు వేచి చూడాలి.ఇదే వీసా కోసం హైదరాబాద్ నుంచి దరఖాస్తు చేసుకుంటే.. 994 రోజులు, చెన్నై నుంచైతే 948 రోజులు, ఢిల్లీ నుంచి 961 రోజులు, కోల్కతా నుంచి 904 రోజుల అపాయింట్మెంట్ వెయిట్ టైం ఉంది. అయితే ఇతర వీసాలకు ఈ వెయిటింగ్ లిస్ట్ కాస్త తక్కువగానే ఉంది.
హైదరాబాద్ నుంచి స్టూడెంట్, ఎక్స్చేంజ్ వీసాల అపాయింట్మెంట్ కోసం 374 రోజులు వేచి ఎదురుచూడాల్సి వస్తోంది. పిటిషన్ బేస్డ్ టెంపరరీ వర్కర్ వీసాల అపాయింట్మెంట్ వెయిటింగ్ టైం 366 రోజులుగా ఉంది. వీసా ఇంటర్వ్యూల సమయం ఎక్కువగా ఉండటంపై అమెరికా రాయబార కార్యాలయం అప్పట్లో స్పందించింది. కరోనా కారణంగా లాక్డౌన్తో పాటు సిబ్బంది కొరత కారణంగా వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, కేవలం కొత్తగా వీసా పొందేవారికే వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటోందని చెప్పింది. అయితే వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ