అకౌంట్ అప్డేట్ పేరిట నగదు మాయం: ఐదుగురు స్కామ్ కాలర్ల ముఠా అరెస్ట్
- November 25, 2022యూఏఈ: బ్యాంకు ఉద్యోగుల వలె నటించి నివాసితుల అకౌంట్ల నుంచి నగదు మాయం చేసిన ఐదుగురు వ్యక్తుల ముఠాను అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు తెలిపారు. షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) డైరెక్టర్ కల్నల్ ఒమర్ అహ్మద్ బల్జోద్ కేసు వివరాలను వెల్లడించారు. స్కామర్లు యాదృచ్ఛికంగా కాల్లు చేసి, వారి బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయాలని బాధితులకు చెబుతారని, వారు స్పందించకపోతే వారి ఖాతాలు స్తంభింపజేయబడతాయని భయపెడతారని పేర్కొన్నారు. ఇలా స్కామర్ల చేతిలో మోసపోయిన అనేక మంది తమకు ఫిర్యాదు చేశారని, అధికారులు విచారణ జరిపి స్కామ్ కాలర్లను గుర్తించినట్లు తెలిపారు. ముఠా ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తున్న అపార్ట్మెంట్ను దర్యాప్తు బృందాలు గుర్తించాయని, అనంతరం ఫ్లాట్పై దాడి చేసి మోసానికి పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు కల్నల్ బల్జోద్ తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద కాల్లను ఎప్పుడూ అటెండ్ చేయవద్దని, బ్యాంక్ వివరాలను లేదా వ్యక్తిగత డేటాను ఎవరితోనూ, ముఖ్యంగా ఆన్లైన్లో లేదా ఫోన్లో ఎప్పుడూ షేర్ చేయవద్దని కల్నల్ బల్జోద్ సూచించారు. తమ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అప్డేట్ చేయాలనుకునే వారు ఫోన్ లో కాకుండా.. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాలన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..