సందర్శకులకు స్వాగతం పలుకుతున్న 'అమద్ దుక్మ్ 22'
- November 25, 2022మస్కట్: దుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో 'అమద్ దుక్మ్ 22' ప్రారంభానికి సిద్ధమైంది. శుక్రవారం నుండి 9 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ను పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫ్రీ జోన్స్ (OPAZ), మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 'అమద్ దుక్మ్ 22' ఈవెంట్ లో సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, ఎంటర్ టైన్ మెంట్ సంబంధించిన సృజనాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సంస్కృతి, ఆవిష్కరణలు, క్రీడలు, సాంకేతికత లతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక సామర్థ్యాన్ని.. పెరుగుతున్న పెట్టుబడులను పరిచయం చేయడం ఈ ఈవెంట్ వెనుక ఉన్న ఆలోచన అని డుక్మ్లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్టింగ్ సీఈఓ ఎంగ్ అహ్మద్ బిన్ అలీ అకాక్ పేర్కొన్నారు. భవిష్యత్తు ఆకాంక్షలను సాధించడంలో యువతది కీలక పాత్ర కాబట్టి వారి సృజనాత్మకతను పెంపొందించేందుకు అమద్ దుక్మ్ 22 ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత