ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి ..

- April 24, 2016 , by Maagulf
ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి ..

పాలేరు ఉప ఎన్నికకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో పువ్వాడ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి తుమ్మలతో ఆయన భేటీ అయినట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 27న ఖమ్మంలో జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగడుతుండగా... జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై నేతలు దైలమాలో పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com