ట్రాఫిక్ జరిమానా 50% తగ్గింపు: సేవా కేంద్రాల వర్కింగ్ అవర్స్ పొడిగింపు
- November 25, 2022
యూఏఈ: ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులకు 50 శాతం తగ్గింపును పొందేందుకు అజ్మాన్ పోలీసులు ట్రాఫిక్, పెట్రోల్ సర్వీసెస్ సెంటర్లో పని గంటలను పొడిగించారు. ఇకపై ఈ కేంద్రం సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 7.30 నుండి రాత్రి 10 గంటల వరకు.. శుక్రవారాల్లో ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది శని, ఆదివారాల్లో సేవా కేంద్రం మూసివేయబడుతుంది. నవంబర్ 21 నుండి అమలులోకి వచ్చిన తగ్గింపు పథకం 2023 జనవరి 6 వరకు ఉంటుంది. ట్రాఫిక్ జరిమానాలను సేవా కేంద్రాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా అజ్మాన్ పోలీస్ యాప్లు, సాహ్ల్ స్మార్ట్ కియోస్క్ల ద్వారా చెల్లించవచ్చు. ఉమ్ అల్ క్వైన్, ఫుజైరాలోని పోలీసు బలగాలు కూడా ట్రాఫిక్ జరిమానాలపై ఇలాంటి తగ్గింపు పథకాలను ప్రకటించాయి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







