ట్రాఫిక్ జరిమానా 50% తగ్గింపు: సేవా కేంద్రాల వర్కింగ్ అవర్స్ పొడిగింపు
- November 25, 2022యూఏఈ: ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులకు 50 శాతం తగ్గింపును పొందేందుకు అజ్మాన్ పోలీసులు ట్రాఫిక్, పెట్రోల్ సర్వీసెస్ సెంటర్లో పని గంటలను పొడిగించారు. ఇకపై ఈ కేంద్రం సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 7.30 నుండి రాత్రి 10 గంటల వరకు.. శుక్రవారాల్లో ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది శని, ఆదివారాల్లో సేవా కేంద్రం మూసివేయబడుతుంది. నవంబర్ 21 నుండి అమలులోకి వచ్చిన తగ్గింపు పథకం 2023 జనవరి 6 వరకు ఉంటుంది. ట్రాఫిక్ జరిమానాలను సేవా కేంద్రాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా అజ్మాన్ పోలీస్ యాప్లు, సాహ్ల్ స్మార్ట్ కియోస్క్ల ద్వారా చెల్లించవచ్చు. ఉమ్ అల్ క్వైన్, ఫుజైరాలోని పోలీసు బలగాలు కూడా ట్రాఫిక్ జరిమానాలపై ఇలాంటి తగ్గింపు పథకాలను ప్రకటించాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..