వర్క్ పర్మిట్ల సస్పెన్షన్: యూఏఈలో కొత్త నిబంధనలు
- November 26, 2022
యూఏఈ: కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్లను నిలిపివేయడానికి దారితీసే నాలుగు రకాల ఉల్లంఘనల గురించి యూఏఈ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) వెల్లడించింది. కొత్తగా ప్రకటించిన తీర్మానంలో ఈ నాలుగు ఉల్లంఘనల గురించి నిర్వచించబడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఆ నాలుగు రకాల ఉల్లంఘనలు:
1. మంత్రిత్వ శాఖ సవరణల ద్వారా సేవా రుసుములు, అడ్మినిస్ట్రేటివ్ జరిమానాలకు సంబంధించి 2020 క్యాబినెట్ రిజల్యూషన్ నం. 21లో నిర్దేశించిన ఉల్లంఘనలు.
2. తగిన కార్మిక వసతి కల్పించడంలో వైఫల్యం. ఉద్యోగులకు అవసరమైన వసతి కల్పించే వరకు కంపెనీ ఫైల్ అడ్మినిస్ట్రేటివ్గా నిలిపివేయబడుతుంది.
3. మానవ అక్రమ రవాణా ఆరోపణలు., ఉల్లంఘించిన సంస్థ నిర్దోషి అని నిరూపించబడే వరకు సస్పెండ్ చేయబడుతుంది. దోషిగా తేలితే కంపెనీకి వ్యతిరేకంగా తుది తీర్పు వెలువడిన తర్వాత సస్పెన్షన్ రెండేళ్లపాటు కొనసాగుతుంది.
4. మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి కంపెనీకి మంజూరు చేయబడిన ఎలక్ట్రానిక్ అధికారాల దుర్వినియోగం. ఈ సందర్భంలో కంపెనీ ఫైల్ నిరూపితమైన ఉల్లంఘన తేదీ నుండి ఆరు నెలల కాలానికి పరిపాలనాపరంగా నిలిపివేయబడుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







