కస్టడీ నుంచి నిందితుడు పరార్: ఇద్దరు పోలీసు అధికారులు 5వేల జరిమానా

- November 26, 2022 , by Maagulf
కస్టడీ నుంచి నిందితుడు పరార్: ఇద్దరు పోలీసు అధికారులు 5వేల జరిమానా

యూఏఈ:  విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులకు దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఒక్కొక్కరికి 5,000 దిర్హామ్‌లు చొప్పున జరిమానా విధించింది. వీరి కస్టడీలో ఉన్న సమయంలో నిందితుడు తప్పించుకోవడంతో కోర్టు వీరిపై సీరియస్ అయింది. అప్పీల్ కోర్టు గత నెలలో తన తీర్పును వెలువరించింది. మార్చిలో మిస్‌డిమీనర్స్ కోర్టు ఇచ్చిన 10,000 దిర్హామ్‌ల జరిమానాను తగ్గించింది. ఇద్దరు వ్యక్తులపై నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించారని అభియోగాలు మోపారు. కోర్లు ఫైల్స్ ప్రకారం.. ఫిబ్రవరి 3న అల్ రఫా పోలీస్ స్టేషన్ అధికారులు అనుమానితుడిని చికిత్స కోసం రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com