ప్రవాసీ భారతీయ దివస్-2023: కువైట్లో కర్టెన్ రైజర్ ఈవెంట్
- November 26, 2022కువైట్: ఇండియాలో 2023 జనవరి 8-10 తేదీల్లో "డయాస్పోరా: అమృత్ కాల్లో భారతదేశం పురోగతికి నమ్మకమైన భాగస్వాములు" అనే ఇతివృత్తంతో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగనున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD)-2023 కోసం కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కర్టెన్ రైజర్ ఈవెంట్ను నిర్వహించింది. ఎంబసీ ఛార్జ్ డి అఫైర్స్ స్మితా పాటిల్ మాట్లాడుతూ.. PBD-2023లో పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కువైట్లోని భారతీయ సమాజ సభ్యులను ఆహ్వానించారు. ఈవెంట్ సందర్భంగా.. పాల్గొనేవారికి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల గురించి అవగాహన కల్పించారు. PBD-2023 కోసం రిజిస్ట్రేషన్ ఫీజుపై 25% తగ్గింపును పొందడం ద్వారా గ్రూప్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ నవంబర్ 3 వరకు గడవు ఉంది. భారతీయ ప్రవాసుల సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ టూరిజం హోటల్ ధరలను తగ్గించింది. PBD-2023 నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జరగబోతోంది. ఇప్పటి వరకు పదహారు PBD సమావేశాలు నిర్వహించబడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా 2021లో 16వ PBD వర్చువల్ గా నిర్వహించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ