ముంబైలో కొత్తగా 32 మీజిల్స్ కేసులు
- November 27, 2022
ముంబై: ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. నగరంలో కొత్తగా మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పేర్కొంది. దీంతో మొత్తం మీజిల్స్ కేసుల సంఖ్య 300కి చేరింది. వీటిలో గత రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 నెలల బాలుడు మీజిల్స్ బారిన పడి మృతి చెందాడు.
దీంతో మీజిల్స్తో నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మృతి చెందారు. బీఎంసీ పరిధిలోని ముంబై, మాలేగావ్, భీవాండీ, థాణే, నాసిక్, అకోలా, కళ్యాణ్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు రికార్డు అవుతున్నాయి. దీంతో ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, బాంద్రా, అంధేరీ, మలాడ్, గోవండీ, చెంబూర్, కుర్లా, భాండూప్ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
మొత్తం 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ మీజిల్స్ కేసులు నమోదవు అతున్నాయి.
తాజా వార్తలు
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!









