ముంబైలో కొత్తగా 32 మీజిల్స్ కేసులు
- November 27, 2022
ముంబై: ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. నగరంలో కొత్తగా మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పేర్కొంది. దీంతో మొత్తం మీజిల్స్ కేసుల సంఖ్య 300కి చేరింది. వీటిలో గత రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 నెలల బాలుడు మీజిల్స్ బారిన పడి మృతి చెందాడు.
దీంతో మీజిల్స్తో నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మృతి చెందారు. బీఎంసీ పరిధిలోని ముంబై, మాలేగావ్, భీవాండీ, థాణే, నాసిక్, అకోలా, కళ్యాణ్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు రికార్డు అవుతున్నాయి. దీంతో ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, బాంద్రా, అంధేరీ, మలాడ్, గోవండీ, చెంబూర్, కుర్లా, భాండూప్ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
మొత్తం 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ మీజిల్స్ కేసులు నమోదవు అతున్నాయి.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







