ఒమన్ లో 9 నెలలపాటు రొయ్యల వేటపై నిషేధం
- November 28, 2022
మస్కట్: తొమ్మిది నెలలపాటు రొయ్యల వేట, వ్యాపారంపై నిషేధం విధించినట్లు ఒమన్ వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి నిషేధపు అంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ 30న సుల్తానేట్లో రొయ్యల చేపలు పట్టే సీజన్ ముగుస్తుందని, డిసెంబర్ 1 నుంచి ఆగస్టు వరకు ఫలదీకరణం, పునరుత్పత్తి, సహజ వృద్ధి కాలంలో రొయ్యల చేపలు పట్టడం, వ్యాపారం చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు, చేపల రవాణాదారులు, కంపెనీలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ దగ్గర ఉన్న రొయ్యల స్టాక్ ను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా RO5,000 జరిమానా లేదా మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు ఏకకాలంలో విధించే అవకాశం ఉందన్నారు. దీనితోపాటు ఫిషింగ్ లైసెన్స్ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దు చేయొచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







