ఒమన్ లో 9 నెలలపాటు రొయ్యల వేటపై నిషేధం
- November 28, 2022
మస్కట్: తొమ్మిది నెలలపాటు రొయ్యల వేట, వ్యాపారంపై నిషేధం విధించినట్లు ఒమన్ వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి నిషేధపు అంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ 30న సుల్తానేట్లో రొయ్యల చేపలు పట్టే సీజన్ ముగుస్తుందని, డిసెంబర్ 1 నుంచి ఆగస్టు వరకు ఫలదీకరణం, పునరుత్పత్తి, సహజ వృద్ధి కాలంలో రొయ్యల చేపలు పట్టడం, వ్యాపారం చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు, చేపల రవాణాదారులు, కంపెనీలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ దగ్గర ఉన్న రొయ్యల స్టాక్ ను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా RO5,000 జరిమానా లేదా మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు ఏకకాలంలో విధించే అవకాశం ఉందన్నారు. దీనితోపాటు ఫిషింగ్ లైసెన్స్ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దు చేయొచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









