ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ సీజ్‌

- November 28, 2022 , by Maagulf
ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ సీజ్‌

ముంబై: విమానాశ్రయాల్లో అత్యంత పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తారు.ప్రయాణికుల లగేజీ కూడా పరిమితికి మించి కొన్ని గ్రాములు అధికంగా ఉన్నా అనుమతించరు.అయినా స్మగ్లర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.ఏదో ఒక దారిలో మాదకద్రవ్యాలు, బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనేవున్నారు.

ముంబైలోని విమానాశ్రయంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు 8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com