ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల
- November 28, 2022
అమరావతి: ఏపీలో పోలీసు నియమకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 315 ఎస్ఐ, 96 రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్, 3,580 కానిస్టేబుల్ (సివిల్), 2,520 ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులు ఉన్నాయి.అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది.
కాగా, యేటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ పోలీసు శాఖను ఆదేశించారు.ఈ మేరకు పోలీసు శాఖ రూపొందించిన ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..