ఫిబ్రవరి 27 నుంచి ఒమన్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్

- November 29, 2022 , by Maagulf
ఫిబ్రవరి 27 నుంచి ఒమన్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్

మస్కట్: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8 వరకు జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సి) మాస్టర్స్ టోర్నమెంట్ కు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ్గజాలు క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, షేన్ వాట్సన్, యూసుఫ్ పఠాన్ తదితరులు పాల్గొనే అవకాశం ఉన్నది. అల్ అమెరత్‌లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ప్రారంభ వేడులకను నిర్వహించనున్నారు. ఒమన్ జనవరి 2022లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభ ఎడిషన్‌ను నిర్వహించింది. ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్ లీగ్ పేరును LLC మాస్టర్స్‌గా పేరు మార్చారు.
ఒమన్‌-ఖతార్ సంయుక్తంగా నిర్వహిస్తున్ ఈ టోర్నీలో మూడు జట్లు - ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు జట్లలో క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, యూసుఫ్ పఠాన్ సహా మొత్తం 60 మంది క్రికెట్ దిగ్గజాలు ఉంటారని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com