ఫిబ్రవరి 27 నుంచి ఒమన్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్
- November 29, 2022
మస్కట్: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8 వరకు జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సి) మాస్టర్స్ టోర్నమెంట్ కు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ్గజాలు క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, షేన్ వాట్సన్, యూసుఫ్ పఠాన్ తదితరులు పాల్గొనే అవకాశం ఉన్నది. అల్ అమెరత్లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ప్రారంభ వేడులకను నిర్వహించనున్నారు. ఒమన్ జనవరి 2022లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభ ఎడిషన్ను నిర్వహించింది. ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్ లీగ్ పేరును LLC మాస్టర్స్గా పేరు మార్చారు.
ఒమన్-ఖతార్ సంయుక్తంగా నిర్వహిస్తున్ ఈ టోర్నీలో మూడు జట్లు - ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు జట్లలో క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, యూసుఫ్ పఠాన్ సహా మొత్తం 60 మంది క్రికెట్ దిగ్గజాలు ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









