49 మంది అరెస్ట్.. 30 టన్నుల డ్రగ్ సీజ్
- November 29, 2022
యూఏఈ: అంతర్జాతీయ కొకైన్ ముఠా గుట్టు రట్టయింది. యూఏఈ సహా ఆరు దేశాలలో చేపట్టిన సంయుక్త ఆపరేషన్ ఫలితంగా అనేక మంది డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. నవంబర్ 8 - 19 మధ్య యూరప్ – యూఏఈ అంతటా అధికారులు దాడులు నిర్వహించారు. 49 అంతర్జాతీయ డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. వారి నుంచి 30 టన్నుల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ పోలీస్, యూరోపోల్, స్పెయిన్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు సంయుక్తంగా పనిచేయడంపై ఉప ప్రధాన మంత్రి, యూఏఈ అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రశంసించారు. 'డెసర్ట్ లైట్' కోడ్-పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో భాగంగా అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్లో ఉన్న ట్రాన్స్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ను ఛేదించారు
తాజా వార్తలు
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!









