రియాద్లో కొత్త విమానాశ్రయ నిర్మాణం.. ప్రకటించిన క్రౌన్ ప్రిన్స్
- November 29, 2022
సౌదీ: రియాద్ లో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ప్రణాళికలను సోమవారం మధ్యాహ్నం క్రౌన్ ప్రిన్స్ ప్రకటించారు. కొత్త విమానాశ్రయం 2030 నాటికి 120 మిలియన్ల మంది ప్రయాణీకులను స్వాగతించేలా నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. 2050 నాటికి 3.5 మిలియన్ టన్నుల కార్గోను ప్రాసెస్ చేసేలా ప్రణాళికలు తయారు చేసినట్లు వెల్లడించారు. గ్లోబల్ లాజిస్టిక్స్, టూరిస్ట్, ట్రాన్స్పోర్ట్ హబ్గా రియాద్ స్థానాన్ని పెంచుతుందన్నారు. కొత్త ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుందని, ఆరు సమాంతర రన్వేలను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ విమానాశ్రయం సౌదీ చమురుయేతర GDPకి 27 బిలియన్ సౌదీ రియాల్స్ను జోడిస్తుందని క్రౌన్ ప్రిన్స్ వెల్లడించారు. రియాద్ను ప్రపంచంలోని టాప్ టెన్ సిటీ ఎకానమీలలో ఒకటిగా మార్చడం, "గ్లోబల్ గేట్వే"గా రియాద్ ను మార్చడం వంటి ప్రయాత్నాలు పెద్ద ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నాయని క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ తెలిపారు. రాబోయే ఎనిమిది సంవత్సరాలలో రియాద్ జనాభా పెరుగుదలను అంచనా వేసి సుమారు 15 నుండి 20 మిలియన్ల మంది ప్రయాణికులు సేవలు అందించేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణ ప్రణాళికలు రూపొందించినట్లు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







