ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బందర్ పోర్ట్ నిర్మాణం
- April 24, 2016
ప్రపంచంలో అతిపెద్ద జెబెల్ ఆలి పోర్ట్ దుబాయ్లో పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
దుబాయ్లోని జెబెల్ ఆలి పోర్ట్ను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బందర్ పోర్టును నిర్మించాలనే ధ్యేయంతో మంత్రి కొల్లు రవీంద్ర ప్రపంచంలో అతిపెద్ద పోర్ట్ అయిన జెబెల్ పోర్ట్ను దుబాయ్లో ఈరోజు పరిశీలించడం జరిగింది. త్వరలో బందర్లో నిర్మించతలపెట్టే పోర్ట్కు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అక్కడ పోర్ట్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. దీంతోపాటు అలీ అండ్ సన్స్ ఆఫ్సోర్ మరియు మెరైన్ సాంకేతిక నిపుణుల బృందంతో భేటి అయ్యారు. ఈసందర్భంగా పోర్ట్ నిర్మాణం, షిప్ల తయారు, రిపేరి, జెట్టి నిర్మాణం, షిప్ లిప్ట్ లు మరియు షిప్ బిల్డింగ్స్ నిర్మాణం, ఎక్స్పోర్ట్స్, మెరైన్ సర్వీసులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అలీ అండ్ సన్స్ సాంకేతిక నిపుణులను బందర్కు ఆహ్వానించడం జరిగింది. బందర్ పోర్ట్ నిర్మాణం, అభివృద్ధిలో వారి సహాయ సహకారాలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కొల్లూరి శివకుమార్, మాగల్ఫ్ శ్రీకాంత్, నాగూర్ షేక్లు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







