భారత్ నుంచి థాయ్ల్యాండ్ 'ఈ-వీసా ఆన్ అరైవల్' కోసం పెరిగిన దరఖాస్తులు
- December 03, 2022
భారత్ నుంచి థాయ్ల్యాండ్ 'ఈ-వీసా ఆన్ అరైవల్' కోసం ఈ ఏడాది దరఖాస్తులు దాదాపు 7రేట్లు పెరిగినట్లు వీసా ఔట్సోర్సింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ స్పెషలిస్ట్ వీఎఫ్ఎస్ గ్లోబల్ గురువారం వెల్లడించింది. ముఖ్యంగా మార్చి నుంచి అక్టోబర్ మధ్య దరఖాస్తులు భారీగా వచ్చాయని తెలిపింది. ఇది 2022 చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని వీఎఫ్ఎస్ గ్లోబల్ తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా దాదాపు రెండేళ్లు ఆగిపోయిన ఇంటర్నెషనల్ విమాన సర్వీసులు మార్చిలో ప్రారంభం కావడం, అప్పటికే చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించడంతో మనోళ్లు విదేశాలకు విహారయాత్రలు, ఇతర పనుల కోసం క్యూకట్టారు. ఈ క్రమంలోనే థాయ్ల్యాండ్ ఈ-వీసా ఆన్ అరైవల్కు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. అది కూడా గతేడాదితో పోలిస్తే ఏడు రేట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇదిలాఉంటే.. వీఎఫ్ఎస్ గ్లోబల్ 2019లో ఇమ్మిగ్రేషన్ బ్యూరో ఆఫ్ థాయ్ల్యాండ్ భాగస్వామ్యంతో ఈ-వీసా ఆన్ అరైవల్ సర్వీసులను ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







