67 కొత్త చారిత్రక ప్రదేశాలను నమోదు చేసిన సౌదీ హెరిటేజ్ కమిషన్
- December 05, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని 67 కొత్త పురావస్తు ప్రదేశాలను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ యాంటిక్విటీలో డాక్యుమెంట్ చేయడానికి, నమోదు చేయడానికి హెరిటేజ్ కమిషన్ ఆమోదం తెలిపింది. కొత్త 67 పురావస్తు ప్రదేశాలలో అనేక పురావస్తు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని 8,531 పురావస్తు ప్రదేశాలు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ యాంటిక్విటీలో నమోదు చేయబడ్డాయి. ఉత్తర సరిహద్దు ప్రాంతం 15 ప్రదేశాలతో అత్యధిక సంఖ్యలో పురావస్తు ప్రదేశాలను కలిగి ఉంది. ఆ తర్వాత 13 సైట్లతో తబుక్ ప్రాంతం, 10 సైట్లతో హేల్, 9 సైట్తో అల్-జౌఫ్, 5 సైట్తో అల్-ఖాసిమ్, రియాద్ , అసీర్ 4 సైట్లతో, మదీనా, అల్-బహా 3 ప్రదేశాలతో, మక్కా 1 పురావస్తు ప్రదేశంతో జాబితాలో ఉన్నాయి.
సౌదీ అరేబియాలోని పురావస్తు, చారిత్రక ప్రదేశాలను కనుగొనడంలో హెరిటేజ్ కమిషన్ పని చేస్తోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ యాంటిక్విటీస్లో అధికారికంగా నమోదు చేస్తుంది. నమోదు తర్వాత కమిషన్ సైట్లను డిజిటల్ మ్యాప్లలో జోడిస్తుంది. ఆ తర్వాత నమోదిత పురావస్తు ప్రదేశాల ప్రాదేశిక డేటాబేస్ను తయారు చేస్తుంది. వారసత్వ ప్రదేశాల పత్రాలు, చిత్రాలను ఆర్కైవ్ చేస్తుంది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







