వీరప్పన్ ఫై చిత్రం ప్రారంభం
- June 18, 2015
గంధపు చెక్కల స్మగ్లింగ్తో పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన స్మగ్లర్ వీరప్పన్. అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభించినట్లు రాంగోపాల్ వర్మ గురువారం ట్విట్టర్లో వెల్లడించారు. వీరప్పన్ వేట కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు... ఆ క్రమంలో అతడిని మట్టుబెట్టడం కథాంశంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. గంధపు చెక్కల వీరప్పన్ కోసం ప్రభుత్వం చేపట్టిన వేట అప్పట్లో ఆసియా ఖండంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో శివరాజుకుమార్ ఉన్నతాధికారిగా కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వీరప్పన్ పాత్రధారిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఎంపిక చేసిన విషయం విదితమే. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగశెట్టి, పరుల్ యాదవ్లు నటిస్తున్నారు. ఈ చిత్రం తెరకెక్కించే క్రమంలో రాంగోపాల్ వర్మ... వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







