డ్రగ్స్ వినియోగం: వ్యక్తికి 60,000 దిర్హామ్ల జరిమానా
- December 08, 2022
దుబాయ్: డ్రగ్స్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతా ద్వారా నిధులు బదిలీ చేసిన అరబ్ వ్యక్తిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితుడు మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నారని, ఉపయోగించారని పేర్కొంటూ దుబాయ్ పోలీసులలోని డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిందని పోలీసు రికార్డులు వెల్లడించాయి. పోలీసు బృందం అతని నివాసం, కారును పరిశీలించడానికి.. అతని నుండి మూత్ర నమూనాను పొందడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందింది. అనంతరం పోలీసు బృందం అతని నివాసంపై దాడి చేసిందని, అక్కడ గంజాయి, డ్రగ్ చిన్న బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వాట్సాప్ ద్వారా ప్రొఫెషనల్ ఏషియన్ డీలర్తో కమ్యూనికేట్ అయినట్లు వెల్లడించాడు. ఏటీఎం ద్వారా డీలర్ ఖాతాలో డబ్బును జమ చేశానని, ఆపై డీలర్ సూచించిన స్థలం నుండి డ్రగ్ తీసుకున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. మాదక ద్రవ్యాల గురించి వాట్సాప్ ద్వారా యాదృచ్ఛికంగా వచ్చిన అనామక సందేశాలకు స్పందించవద్దని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!







