డ్రగ్స్ వినియోగం: వ్యక్తికి 60,000 దిర్హామ్ల జరిమానా
- December 08, 2022
దుబాయ్: డ్రగ్స్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతా ద్వారా నిధులు బదిలీ చేసిన అరబ్ వ్యక్తిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితుడు మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నారని, ఉపయోగించారని పేర్కొంటూ దుబాయ్ పోలీసులలోని డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిందని పోలీసు రికార్డులు వెల్లడించాయి. పోలీసు బృందం అతని నివాసం, కారును పరిశీలించడానికి.. అతని నుండి మూత్ర నమూనాను పొందడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందింది. అనంతరం పోలీసు బృందం అతని నివాసంపై దాడి చేసిందని, అక్కడ గంజాయి, డ్రగ్ చిన్న బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వాట్సాప్ ద్వారా ప్రొఫెషనల్ ఏషియన్ డీలర్తో కమ్యూనికేట్ అయినట్లు వెల్లడించాడు. ఏటీఎం ద్వారా డీలర్ ఖాతాలో డబ్బును జమ చేశానని, ఆపై డీలర్ సూచించిన స్థలం నుండి డ్రగ్ తీసుకున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. మాదక ద్రవ్యాల గురించి వాట్సాప్ ద్వారా యాదృచ్ఛికంగా వచ్చిన అనామక సందేశాలకు స్పందించవద్దని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







