ఫిషింగ్ చట్టం ఉల్లంఘం: 22 మంది ప్రవాసులు బహిష్కరణ
- December 09, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లోని మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇరవై ఇద్దరు ప్రవాసులను బహిష్కరించినట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) తెలిపింది. అల్ వుస్తా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ వాటర్ రిసోర్సెస్లోని మత్స్య నియంత్రణ బృందం, రాయల్ ఒమన్ పోలీసు పోలీసుల సహకారంతో చేపట్టిన సంయుక్త తనిఖీల్లో మెరైన్ ఫిషింగ్ లా, లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 22 మంది ప్రవాస కార్మికులను బహిష్కరించినట్లు వెల్లడించింది. మత్స్య నియంత్రణ బృందం, డుక్మ్ పోలీస్ స్టేషన్ సహకారంతో మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 46 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అల్ వుస్తా గవర్నరేట్లో నవంబర్ 20 నుండి 30 వరకు 53 కార్మిక ఉల్లంఘనలను జారీ చేసిందని పేర్కొంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







