మొరాకో ఆటతీరు అబ్బురపరుస్తూనే ఉంది: షేక్ మహమ్మద్
- December 11, 2022
యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పోర్చుగల్పై విజయం సాధించిన మొరాకో ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందించారు. "మొరాకో ప్రపంచ కప్లో మరో చారిత్రాత్మక విజయంతో మమ్మల్ని అబ్బురపరుస్తూనే ఉంది... మొరాకో హీరోలు అరబ్ కలను సాకారం చేసినందుకు అభినందనలు" అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా మొరాకో జట్టు విజయంపై అభినందనలు తెలిపారు. " ఓ మొరాకో... అభినందనలు. మరోసారి మీరు చరిత్ర సృష్టించారు. ప్రతి అరబ్.. ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులను సంతోషపరిచారు" అని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు.
దుబాయ్ ఉప పాలకుడు, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా మొరాకో జట్టుపై ప్రశంసలు కురిపించారు. “ఈ చారిత్రాత్మక విజయానికి మొరాకో నాయకత్వాన్ని, ప్రజలను మేము అభినందిస్తున్నాము. మొరాకో ప్రదర్శన, అరబ్ ఫుట్బాల్కు అపూర్వమైన విజయం.” అని షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









