మొరాకో ఆటతీరు అబ్బురపరుస్తూనే ఉంది: షేక్ మహమ్మద్
- December 11, 2022
యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పోర్చుగల్పై విజయం సాధించిన మొరాకో ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందించారు. "మొరాకో ప్రపంచ కప్లో మరో చారిత్రాత్మక విజయంతో మమ్మల్ని అబ్బురపరుస్తూనే ఉంది... మొరాకో హీరోలు అరబ్ కలను సాకారం చేసినందుకు అభినందనలు" అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా మొరాకో జట్టు విజయంపై అభినందనలు తెలిపారు. " ఓ మొరాకో... అభినందనలు. మరోసారి మీరు చరిత్ర సృష్టించారు. ప్రతి అరబ్.. ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులను సంతోషపరిచారు" అని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు.
దుబాయ్ ఉప పాలకుడు, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా మొరాకో జట్టుపై ప్రశంసలు కురిపించారు. “ఈ చారిత్రాత్మక విజయానికి మొరాకో నాయకత్వాన్ని, ప్రజలను మేము అభినందిస్తున్నాము. మొరాకో ప్రదర్శన, అరబ్ ఫుట్బాల్కు అపూర్వమైన విజయం.” అని షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం







