కన్నీళ్లతో మైదానాన్ని వీడిన స్టార్ ఆటగాడు..
- December 11, 2022
దోహా: రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది. ఫలితంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రొనాల్డో తన ఆఖరి ప్రపంచకప్లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలన్న కల నెరవేరక పోవటంతో మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చాడు. డ్రసింగ్ రూంకు వెళ్లేంత వరకు రొనాల్డో కన్నీరు పెడుతూనే కనిపించాడు.
శనివారం మొరాకో – పోర్చుగల్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో మొరాకో జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో హాట్ ఫేవరెట్ జట్టు పోర్చుగల్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. క్రిస్టియానో రొనాల్డోను టీం మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా బరిలోకి దించారు. అయితే, మొరాకో పటిష్ఠ డిఫెన్స్ ముందు రొనాల్డో తలవంచాడు. మరోవైపు సెమీఫైనల్ కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉంటే.. ఎన్నో గోప్ప ట్రోఫీలను సాధించిన రోనాల్డో.. ప్రపంచకప్ టైటిల్ లేకుండానే తన కెరీర్ను ముగించాల్సి వస్తుంది. తన వయస్సు దృష్ట్యా రోనాల్డోకు ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఖతార్ లో జరిగే ప్రపంచ కప్ లో జట్టుకు కప్ అందించి తన కలను నెరవేర్చుకోవాలని రొనాల్డో భావించాడు. కానీ, రొనాల్డో ఆశలు కలగానే మిగిలిపోయాయి.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







