మనీలాండరింగ్ దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష, SR500,000 జరిమానా
- December 12, 2022
రియాద్: మనీలాండరింగ్లో నేరం రుజువైన తర్వాత సౌదీ కోర్టు ఒక సౌదీ, నలుగురు అరబ్ జాతీయులకు 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు SR 500,000 జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. నేరానికి పాల్పడిన డబ్బుతో పాటు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని, జైలుశిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. సౌదీ పౌరుడు వాణిజ్య సంస్థల కోసం రిజిస్ట్రేషన్ తెరిచాడు. ఆపై సంస్థల కోసం బ్యాంకు ఖాతాలు తెరిచాడు. ఈ సంస్థల పేరుతో లావాదేవీలు చేపట్టడానికి వీలుగా వాటిని ప్రవాసులకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు, వాణిజ్య సంస్థల ఖాతాలపై జరిపిన ఆర్థిక పరిశోధనలలో ప్రవాసుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖాతాలలో జమ చేసి, ఆపై వాటిని ఇతర దేశాలకు బదిలీ చేసినట్లు విచారణలో తేలడంతో నిందిదులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









