అజ్మాన్లో వంతెనపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు
- December 12, 2022
యూఏఈ: షేక్ ఖలీఫా వంతెనపై ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. వంతెన పైనుండి దూకుతానని ఓ ఆసియా జాతీయుడు బెదిరించినట్లు ఆపరేషన్ గదికి సమాచారం అందిందని అజ్మాన్ పోలీస్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి తెలిపారు. వెంటనే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, పెట్రోలింగ్ పోలీసులు రెస్క్యూ సంఘటన ప్రదేశానికి చేరుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సదరు వ్యక్తితో మాట్లాడి అతడు వంతెనపై నుంచి దూకకుండా నిలువరించినట్లు తెలిపారు. వ్యూహాంలో భాగంగా ఓ వంతెన చివరిలో కూర్చున్న వ్యక్తితో ఓ అధికారి మాట్లాడుతుండగా.. మరో అధికారి సదరు వ్యక్తిని పట్టుకున్నానాడని, మరో ఇద్దరు అధికారులు వారికి సహకరించి అతడిని లాగేశారని వెల్లడించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ ఆ యువకుడిని హమీదియా పోలీస్ స్టేషన్కు తరలించిదని తెలిపారు. ఆ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. అతని అప్పు తీర్చడానికి, అతని ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి అతని కేసు కమ్యూనిటీ పోలీసులకు రిఫర్ చేసినట్లు అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







