అజ్మాన్లో వంతెనపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు
- December 12, 2022
యూఏఈ: షేక్ ఖలీఫా వంతెనపై ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. వంతెన పైనుండి దూకుతానని ఓ ఆసియా జాతీయుడు బెదిరించినట్లు ఆపరేషన్ గదికి సమాచారం అందిందని అజ్మాన్ పోలీస్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి తెలిపారు. వెంటనే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, పెట్రోలింగ్ పోలీసులు రెస్క్యూ సంఘటన ప్రదేశానికి చేరుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సదరు వ్యక్తితో మాట్లాడి అతడు వంతెనపై నుంచి దూకకుండా నిలువరించినట్లు తెలిపారు. వ్యూహాంలో భాగంగా ఓ వంతెన చివరిలో కూర్చున్న వ్యక్తితో ఓ అధికారి మాట్లాడుతుండగా.. మరో అధికారి సదరు వ్యక్తిని పట్టుకున్నానాడని, మరో ఇద్దరు అధికారులు వారికి సహకరించి అతడిని లాగేశారని వెల్లడించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ ఆ యువకుడిని హమీదియా పోలీస్ స్టేషన్కు తరలించిదని తెలిపారు. ఆ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. అతని అప్పు తీర్చడానికి, అతని ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి అతని కేసు కమ్యూనిటీ పోలీసులకు రిఫర్ చేసినట్లు అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి వెల్లడించారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







