అజ్మాన్లో వంతెనపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు
- December 12, 2022
యూఏఈ: షేక్ ఖలీఫా వంతెనపై ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. వంతెన పైనుండి దూకుతానని ఓ ఆసియా జాతీయుడు బెదిరించినట్లు ఆపరేషన్ గదికి సమాచారం అందిందని అజ్మాన్ పోలీస్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి తెలిపారు. వెంటనే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, పెట్రోలింగ్ పోలీసులు రెస్క్యూ సంఘటన ప్రదేశానికి చేరుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సదరు వ్యక్తితో మాట్లాడి అతడు వంతెనపై నుంచి దూకకుండా నిలువరించినట్లు తెలిపారు. వ్యూహాంలో భాగంగా ఓ వంతెన చివరిలో కూర్చున్న వ్యక్తితో ఓ అధికారి మాట్లాడుతుండగా.. మరో అధికారి సదరు వ్యక్తిని పట్టుకున్నానాడని, మరో ఇద్దరు అధికారులు వారికి సహకరించి అతడిని లాగేశారని వెల్లడించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ ఆ యువకుడిని హమీదియా పోలీస్ స్టేషన్కు తరలించిదని తెలిపారు. ఆ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. అతని అప్పు తీర్చడానికి, అతని ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి అతని కేసు కమ్యూనిటీ పోలీసులకు రిఫర్ చేసినట్లు అబ్దుల్లా సైఫ్ అల్-మత్రుషి వెల్లడించారు.
తాజా వార్తలు
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్







