హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ సమీపంలో భారీ పేలుడు
- December 15, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీ పేలుడు సంభవించింది.గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడుతో భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్ రావు సిబ్బంది పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన తండ్రి కొడుకులు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రయ్య, సురేష్ గా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







