సగం ధరకే ఐఫోన్ అంటూ ఫ్రాడ్.. వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా
- December 15, 2022
దుబాయ్: సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి అరబ్ మహిళను మోసం చేసిన గల్ఫ్ పౌరుడిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మొబైల్ ఫోన్లను వాటి మార్కెట్ విలువలలో సగం కంటే తక్కువ ధరకే అందిస్తానంటూ సదరు వ్యక్తి ప్రకటనలు పెట్టాడు. నిందితుడితో తనకు గతంలో ఎలాంటి సంబంధాలు లేవని బాధితురాలు పేర్కొంది. ఐఫోన్లను తక్కువ ధరకు అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనను చూసి సంప్రదించినట్లు ఆమె కోర్టుకు తెలిపింది. 60,000 దిర్హామ్లకే ఐఫోన్ ను పంపడానికి ప్రకటన ఇచ్చిన వ్యక్తి అంగీకరించాడని, దాంతో అతని అకౌంట్ కు డబ్బును బదిలీ చేసినట్లు మహిళ పేర్కొంది. అయితే ఆ మొత్తాన్ని అందుకున్న తర్వాత సదరు వ్యక్తి ఐ ఫోన్ ను పంపలేదని, డబ్బును కూడా బదిలీ చేయలేదని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారించిన కోర్టు.. నిందితుడికి ఒక నెల జైలుశిక్ష, 60,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









