సగం ధరకే ఐఫోన్ అంటూ ఫ్రాడ్.. వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా
- December 15, 2022
దుబాయ్: సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి అరబ్ మహిళను మోసం చేసిన గల్ఫ్ పౌరుడిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మొబైల్ ఫోన్లను వాటి మార్కెట్ విలువలలో సగం కంటే తక్కువ ధరకే అందిస్తానంటూ సదరు వ్యక్తి ప్రకటనలు పెట్టాడు. నిందితుడితో తనకు గతంలో ఎలాంటి సంబంధాలు లేవని బాధితురాలు పేర్కొంది. ఐఫోన్లను తక్కువ ధరకు అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనను చూసి సంప్రదించినట్లు ఆమె కోర్టుకు తెలిపింది. 60,000 దిర్హామ్లకే ఐఫోన్ ను పంపడానికి ప్రకటన ఇచ్చిన వ్యక్తి అంగీకరించాడని, దాంతో అతని అకౌంట్ కు డబ్బును బదిలీ చేసినట్లు మహిళ పేర్కొంది. అయితే ఆ మొత్తాన్ని అందుకున్న తర్వాత సదరు వ్యక్తి ఐ ఫోన్ ను పంపలేదని, డబ్బును కూడా బదిలీ చేయలేదని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారించిన కోర్టు.. నిందితుడికి ఒక నెల జైలుశిక్ష, 60,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







