టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట
- December 16, 2022 
            అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజినల్ బెంచ్ తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శుక్రవారం (డిసెంబర్ 16,2022) దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన డివిజినల్ బెంచ్ కొట్టివేసింది. తీర్పును సస్పెండ్ చేసింది. ఈవో ధర్మారావుకు సింగిల్ బెంచ్ నెల రోజులు జైలుశిక్ష,రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను డివిజినల్ సస్పెండ్ చేసింది.
కాగా కొన్నాళ్ల క్రితం టీటీడీకి చెందిన ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు సర్వీస్ క్రమబద్దీకరణ విషయంలో తమకు న్యాయం చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సింగిల్ బెంచ్ సదరు ఉద్యోగులను క్రమబద్దీకించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో సింగిల్ బెంచ్ ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కింద నెల రోజులు జైలు..రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దర్మారెడ్డి పిటీషన్ వేయగా డివిజినల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ధర్మారెడ్డికి ఊరట కలిగింది.
తాజా వార్తలు
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!
- మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్







