TTD బోర్డు సభ్యుడిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్
- December 16, 2022
అమరావతి: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్మ తో ‘వ్యూహం’ మూవీని నిర్మిస్తున్న నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు కీలక పదవి అప్పగించారు జగన్. TTD బోర్డు సభ్యుడిగా.. కిరణ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డులో ఇప్పటికే 23 మంది సభ్యులు ఉన్నారు. కిరణ్ ఎంట్రీతో అది 24కు చేరనుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యిన దగ్గరి నుండి అంత వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ మధ్యనే వర్మ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్తో భేటీ తర్వాత రెండు సినిమాలు వర్మ ప్రకటించారు. మొదటి సినిమా పేరు వ్యూహం కాగా.. రెండో సినిమా పేరు శపధం అని ప్రకటించారు. ఈ సినిమాలకి దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. దాసరి కిరణ్ కుమార్ను టీటీడీ బోర్డు మెంబర్గా నియమించడం చర్చనీయాంశం అయ్యింది. ఇక టీటీడీ బోర్డు సభ్యుడిగా కిరణ్ నియామకంఫై వర్మ ట్వీట్ చేసాడు. తాను తీసే వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అని.. ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం ఆనందంగా ఉందన్నారు.
ముఖ్య మంత్రి @ysjagan గారి చేత టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికకాబడ్డ నా “వ్యూహం” ప్రొడ్యూసర్ @dkkzoomin గారికి అతి పెద్ద కంగ్రాట్స్💐💐💐💐💐 pic.twitter.com/dRmgcnynzM
— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2022
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







