విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం
- December 17, 2022
విశాఖపట్నం: విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలను రాబడుతున్నారు. పట్టుబడ్డ వారిలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి విశాఖలో అమ్ముతుండగా పోలీసులకు సమాచారం వచ్చింది.
బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ సమీపంలో ముఠా డ్రగ్స్ అమ్ముతుండగా పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు మాటు వేసి డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పట్టుకుని, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు లక్షల రూపాయల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విశాఖలోని ఓ బడా రాజకీయనేత నేత కొడుకు సైతం ఈ డ్రగ్స్ ముఠాలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నడూ లేని విధంగా టాస్క్ ఫోర్స్ కేసుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి. ఇప్పటికే నగరంలో డ్రగ్స్ ముఠాలను జల్లెడ పట్టే విధంగా డీసీపీ శ్రీకాంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా యువతను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ను విక్రయిస్తున్న ముఠాలపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపారు. గతంలో డ్రగ్స్ అమ్ముతూ అరెస్టైన నిందితులపై నిఘా ఉంచారు. అయితే చాపకింద నీరులాగా డ్రగ్స్ నరగంలోకి వస్తూనేవుంది.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







