విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం
- December 17, 2022
విశాఖపట్నం: విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలను రాబడుతున్నారు. పట్టుబడ్డ వారిలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి విశాఖలో అమ్ముతుండగా పోలీసులకు సమాచారం వచ్చింది.
బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ సమీపంలో ముఠా డ్రగ్స్ అమ్ముతుండగా పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు మాటు వేసి డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పట్టుకుని, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు లక్షల రూపాయల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విశాఖలోని ఓ బడా రాజకీయనేత నేత కొడుకు సైతం ఈ డ్రగ్స్ ముఠాలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నడూ లేని విధంగా టాస్క్ ఫోర్స్ కేసుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి. ఇప్పటికే నగరంలో డ్రగ్స్ ముఠాలను జల్లెడ పట్టే విధంగా డీసీపీ శ్రీకాంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా యువతను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ను విక్రయిస్తున్న ముఠాలపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపారు. గతంలో డ్రగ్స్ అమ్ముతూ అరెస్టైన నిందితులపై నిఘా ఉంచారు. అయితే చాపకింద నీరులాగా డ్రగ్స్ నరగంలోకి వస్తూనేవుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







