బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త...
- December 17, 2022
న్యూ ఢిల్లీ: పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లనున్న వారికి ఇక పై దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే విజిట్ వీసాలు అందనున్నాయి.ఈ విషయాన్ని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి 15 రోజుల్లోనే విజిట్ వీసా ఇస్తామని రెండు నెలల క్రితం ప్రకటించామని గుర్తు చేశారు. ఇంకా ముందుగానే కావాలనుకుంటే ‘ప్రయారిటీ వీసా విధానా’న్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆ మార్గంలో అయితే అయిదు రోజుల్లోనే వీసా వస్తుందని చెప్పారు. భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసాలను కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరిలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ వీసాలకు డిమాండు అధికంగా ఉన్నందున త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







