బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త...
- December 17, 2022
న్యూ ఢిల్లీ: పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లనున్న వారికి ఇక పై దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే విజిట్ వీసాలు అందనున్నాయి.ఈ విషయాన్ని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి 15 రోజుల్లోనే విజిట్ వీసా ఇస్తామని రెండు నెలల క్రితం ప్రకటించామని గుర్తు చేశారు. ఇంకా ముందుగానే కావాలనుకుంటే ‘ప్రయారిటీ వీసా విధానా’న్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆ మార్గంలో అయితే అయిదు రోజుల్లోనే వీసా వస్తుందని చెప్పారు. భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసాలను కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరిలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ వీసాలకు డిమాండు అధికంగా ఉన్నందున త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







