రేపు సీఎం జగన్ పుట్టిన రోజు.. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు
- December 20, 2022
అమరావతి: సీఎం జగన్ పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రామాలు నిర్వహించేదుకు రెడీ అయ్యారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరుతో కొద్ది రోజులుగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. కళారూపాల ప్రదర్శనలతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు.దీని కోసం రూ.2 కోట్లను కేటాయించి వేడుకలు చేస్తున్నారు.జగన్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడం కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసి సజ్టల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
ఇందులో ఎవరికైనా అవసరమైనప్పుడు రక్తదానం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.గతంలో 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని తెలిపారు.ఈ సారి రికార్డు బ్రేక్ చేసే విధంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సారి http://www.ysrcpblooddonation.com/ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







