ఒమన్లో 347 ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు, 7092 రిజిస్ట్రేషన్లు
- December 20, 2022
మస్కట్: షిఫా దరఖాస్తుపై 7,092 మంది దాతలు (మరణం తర్వాత అవయవ దాతలు) నమోదు చేసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్లో అవయవ మార్పిడి ఆపరేషన్ల సంఖ్య 347 కి చేరుకున్నాయని తెలిపింది. వాటిలో 306 ప్రత్యక్ష దాతలు, 19 మరణించిన దాతల నుండి పొందిన 325 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఉండగా.. ప్రత్యక్ష దాతల నుండి కాలేయ మార్పిడి సంఖ్య 22 గా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవయవ దానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవయవ దానం కోసం జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ గణంకాలను వెల్లడించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న ఒమన్ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హెల్త్ మినిస్ట్రీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







