ఒమన్‌లో 347 ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు, 7092 రిజిస్ట్రేషన్లు

- December 20, 2022 , by Maagulf
ఒమన్‌లో 347 ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు, 7092 రిజిస్ట్రేషన్లు

మస్కట్: షిఫా దరఖాస్తుపై 7,092 మంది దాతలు (మరణం తర్వాత అవయవ దాతలు) నమోదు చేసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్‌లో అవయవ మార్పిడి ఆపరేషన్ల సంఖ్య 347 కి చేరుకున్నాయని తెలిపింది. వాటిలో 306 ప్రత్యక్ష దాతలు, 19 మరణించిన దాతల నుండి పొందిన 325 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఉండగా..  ప్రత్యక్ష దాతల నుండి కాలేయ మార్పిడి సంఖ్య 22 గా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవయవ దానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవయవ దానం కోసం జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ గణంకాలను వెల్లడించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న ఒమన్ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హెల్త్ మినిస్ట్రీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com