మెడిసిన్ ఫీ ఎఫెక్ట్:అసుపత్రులలో 60 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య
- December 22, 2022
కువైట్: కొత్త మెడిసిన్ ఫీ కారణంగా ప్రభుత్వ క్లినిక్లు, ఆసుపత్రులను సందర్శించే ప్రవాసుల సంఖ్య 60 శాతం వరకు తగ్గిందని మెడికల్ రంగ నిపుణులు ఓ నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. ప్రవాసులకు సూచించిన మందులకు రుసుము వసూలు చేయాలనే నిర్ణయం అమలులోకి వచ్చిన రెండు రోజుల్లో కొన్ని క్లినిక్లలో రోజుకు 1,200 మంది రోగులకు సేవలందించే సందర్శకుల సంఖ్య 400 కంటే తక్కువకు పడిపోయింది. దాదాపు 100 మంది వ్యక్తులు వైద్యం కోసం నమోదు చేసుకున్నా మందులు తీసుకోకుండా కేవలం పరీక్షలతో సరిపెట్టుకున్నారు. అయితే డయాబెటిస్ క్లినిక్లలో సందర్శకుల సంఖ్యలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రమాద విభాగాల్లోని సందర్శకుల సంఖ్య కూడా ప్రభావితం కాలేదని సదరు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







