మక్కాను ముంచెత్తిన వరదలు.. నష్టం అంచనాకు కమిటీలు
- December 24, 2022
జెడ్డా: మక్కాలో వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కమిటీలను ఏర్పాటు చేసినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. కుండపోత వర్షాలు పవిత్ర నగరాన్ని అతలాకుతలం చేసిందని, వరదల వల్ల నష్టపోయిన వారి నుండి నష్టపరిహారం కోసం కమిటీలు అభ్యర్థనలను స్వీకరించడం ప్రారంభిస్తాయని డైరెక్టరేట్ పేర్కొంది. ఇప్పటివరకు "కుండపోత వర్షాల కారణంగా మేము ఎటువంటి మరణాలు లేదా గాయాలను నమోదు చేయలేదు" అని డైరెక్టరేట్ తెలిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు, వీడియోలు మక్కాలోని భవనాలపై వర్షపు నీరు ప్రవహించడం, కార్లు కొట్టుకుపోతున్నట్లు చూపించాయి. అంతకుముందు మక్కాలో భారీ వర్షాలు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరికలు జారీ చేసింది. మక్కా ప్రాంతంలోని విపత్తు నిర్వహణ కేంద్రం నివాసితులు అవసరమైతే తప్ప తమ ఇళ్లను వదిలి రావొద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







