హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను ఆదుకున్న శివకుమార్
- December 24, 2022
            మనామా: బహ్రెయిన్ లో అనారోగ్యంతో బాధపడుతున్న హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను శ్రామికబంధువుగా పిలుచుకునే శివకుమార్ ఆదుకున్నారు. ఆమె ఇండియాకు తిరిగి వెళ్లేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేసి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఆమెకు అందజేశారు.
తూర్పు గోదావరి జిల్లా వనపల్లి గ్రామానికి చెందిన సరిల పళ్ళలమ్మ గత ఏడేళ్లుగా బహ్రెయిన్ హౌస్ మెయిడ్ గా పనిచేస్తున్నారు. గతేడాది ఇండియాకు సెలవుల కోసం వెళ్లి వచ్చిన తర్వాత స్పాన్సర్ దగ్గరికి వెళ్లకుండా బయట తెలిసిన వారివద్ద పనిచేస్తుకుంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో తన భర్త చనిపోయాడు. తన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నది. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సహాయం చేయమని శివకుమార్ ని సంప్రదించగా.. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సాయం చేసి అతడు పెద్దమనసు చాటుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయుడు
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 







