టీవీ సీరియల్ సెట్లో 21 ఏళ్ల బాలీవుడ్ నటి ఆత్మహత్య
- December 25, 2022
ముంబై: అనేక టెలివిజన్ షోలు, బాలీవుడ్ సినిమాల్లో నటించిన 21 ఏళ్ల భారతీయ నటి శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో టీవీ సీరియల్ సెట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. తునీషా శర్మ సీరియల్ చిత్రీకరణ సమయంలో వాష్ రూమ్కు వెళ్లి చాలా సేపటికి తిరిగి రాలేదు. తలుపులు పగలగొట్టి చూడగా ఆమె రెస్ట్రూమ్లో ఉరి వేసుకుని కనిపించిందని పేర్కొన్నారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తునీషా 'భరత్ క వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్'తో తొలిసారిగా నటించింది. ఆమె 'ఇష్క్ సుభాన్ అల్లా', 'గబ్బర్ పూంచ్వాలా', 'షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్', 'చక్రవర్తిన్ అశోక సామ్రాట్' వంటి సీరియల్స్ లలో పనిచేశారు. అలాగే 'ఫితూర్', 'బార్ బార్ దేఖో', 'కహానీ 2: దుర్గా రాణి సింగ్', 'దబాంగ్ 3' వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







