టీవీ సీరియల్ సెట్లో 21 ఏళ్ల బాలీవుడ్ నటి ఆత్మహత్య
- December 25, 2022 
            ముంబై: అనేక టెలివిజన్ షోలు, బాలీవుడ్ సినిమాల్లో నటించిన 21 ఏళ్ల భారతీయ నటి శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో టీవీ సీరియల్ సెట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. తునీషా శర్మ సీరియల్ చిత్రీకరణ సమయంలో వాష్ రూమ్కు వెళ్లి చాలా సేపటికి తిరిగి రాలేదు. తలుపులు పగలగొట్టి చూడగా ఆమె రెస్ట్రూమ్లో ఉరి వేసుకుని కనిపించిందని పేర్కొన్నారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తునీషా 'భరత్ క వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్'తో తొలిసారిగా నటించింది. ఆమె 'ఇష్క్ సుభాన్ అల్లా', 'గబ్బర్ పూంచ్వాలా', 'షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్', 'చక్రవర్తిన్ అశోక సామ్రాట్' వంటి సీరియల్స్ లలో పనిచేశారు. అలాగే 'ఫితూర్', 'బార్ బార్ దేఖో', 'కహానీ 2: దుర్గా రాణి సింగ్', 'దబాంగ్ 3' వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు.
తాజా వార్తలు
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!
- మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్







