నేడు ప్రధాని మోడీతో సిఎం జగన్ భేటీ
- December 28, 2022
న్యూఢిల్లీ: సిఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా పెండింగ్ బకాయిలు, ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు జగన్ తో పాటు వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఇదిలావుంచితే, ఈ నెల మొదటి వారంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశానికి జగన్ హాజరైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







