ప్రపంచ రికార్డును సమంచేసిన క్రీడాకారిణి

- April 27, 2016 , by Maagulf
ప్రపంచ రికార్డును సమంచేసిన క్రీడాకారిణి

ఆర్చరీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డును భారత క్రీడాకారిణి దీపిక కుమారి సమం చేసింది. ఇప్పటి వరకు ఆ రికార్డు దక్షిణ కొరియాకు చెందిన కి బొబే పేరు మీద ఉంది. 2015లో ఆమె 720కి 686స్కోర్‌ చేసి ప్రపంచ రికార్డును సాధించింది. ఇప్పుడు అదే స్కోరును దీపిక కుమారి సైతం సాధించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌లో మహిళల రికర్వ్‌ ఈవెంట్‌లో ఆమె ఈ రికార్డును సమం చేసింది. ఇదిలా ఉండగా 2011, 2012, 2013ల్లో జరిగిన ప్రపంచకప్‌ల్లో దీపిక వరసగా వెండి పతకాలు సాధించింది. ఇదిలా ఉండగా ఆమె ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com