‘మైత్రి’ కారణంగా హర్టయ్యానంటోన్న నైజాం రాజు ‘దిల్’ రాజు.!
- December 30, 2022
నైజాంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలంటే ముందుండే డిస్ర్టిబ్యూటర్ దిల్ రాజు. కానీ, ఈ ఏడాది సంక్రాంతికి దిల్ రాజుకు నైజాంలో గట్టి షాకే తగిలిందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య ‘వీర సింహారెడ్డి’, మెగాస్టార్ ‘వాల్తేర్ వీరయ్య’.
ఈ రెండూ ఒకే బ్యానర్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు. అదే మైత్రీ మూవీస్ మేకర్స్. నిజానికి ఇదో ప్రొడక్షన్ హౌస్. కానీ, ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసి, తమ సినిమాల్ని సొంతంగా రిలీజ్ చేసుకుంటోంది.
మరోవైపు తమిళ హీరో విజయ్తో దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ మూవీ ధియేటర్ల ఇష్యూ ఇంకా నడుస్తూనే వుంది. ఆ సినిమాకి ఎంత చేసినా పెద్దగా బజ్ కూడా క్రియేట్ కావడం లేదు. దాంతో, మైత్రీ వాళ్లపై దిల్ రాజు అసూయ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మధ్య ఓ ఈవెంట్లో తన అసూయను చెప్పకనే చెప్పేసి బయటపడిపోయారు రాజుగారు. మైత్రీ వాళ్లు డిస్ర్టిబ్యూషన్ స్టార్ట్ చేయడం తనకెంతో ఆనందంగా వుందని పైకి చెప్పినా లోలోపల మాత్రం చాలా కుమిలిపోతున్నట్లు ఆయన ముఖంలో కనిపిస్తోందంటూ, నెట్టింటి వేదికగా కామెంట్లు షురూ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







