దుబాయ్ కు తరలివస్తోన్న పర్యాటకులు
- December 31, 2022
యూఏఈ: న్యూ ఇయర్ని స్వాగతించడానికి దుబాయ్ సిద్ధమైంది. పర్యాటకులతో దుబాయ్ వీధులు కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించడానికి పర్యాటకులు దుబాయ్కి తరలి రావడంతో, ఎమిరేట్ పర్యాటక రంగం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ప్రధాన ఈవెంట్ల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. దుబాయ్లో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. బుర్జ్ ఖలీఫా వద్ద నిర్వహించే బాణసంచా వేడుకలను తిలకించేందుకు వేలాది మంది సందర్శకులు ఆసక్తి చూపుతారు.
మరోవైపు విదేశీ సందర్శకులు భారీగా రావడం వల్ల దుబాయ్ ఎయిర్పోర్ట్లు కిటకిటలాడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గుండా దాదాపు రెండు మిలియన్ల మంది ప్రయాణీకులు వచ్చిపోతారని అంచనా వేస్తున్నారు. రోజువారీ సగటు ట్రాఫిక్ 245,000 మంది ప్రయాణీకులకు చేరుకోవడంతో దుబాయ్ ఎయిర్ పోర్టులు గరిష్ట ప్రయాణ సలహాను జారీ చేసింది. జనవరి 2న 257,000 మంది ప్రయాణీకుల రద్దీతో అత్యంత రద్దీగా ఉండే రోజుగా అంచనా వేస్తున్నారు.
“అందమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రస్తుతం ఎమిరేట్ను సందర్శిస్తున్న చాలా మంది పర్యాటకులతో దుబాయ్ చాలా బిజీగా ఉంది. షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువ ఫుట్ఫాల్ను ఆనందిస్తున్నాయి. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, బుర్జ్ ఖలీఫా వంటి పర్యాటక స్థలాలు వద్ద నిర్వహించే ఈవెంట్లకు బుకింగ్లకు విపరీత డిమాండ్ ఉంది. వచ్చే ఐదు-ఆరు రోజులలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల బుకింగ్లు పూర్తి కానున్నాయి.” అని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ తెలిపారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







