‘పవర్’ వారసుడొచ్చాడహో.! అకీరానందన్ ఎంట్రీ.!
- December 31, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు అకీరానందన్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆగండాగండి సినిమాల్లోకి కాదు. న్యూ ఇయర్ సందర్భంగా డిశంబర్ 31న పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘ఖుషీ’ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
విడుదలైన అన్ని ధియేటర్లలోనూ సినిమాకి హౌస్ఫుల్ బోర్డులే. కొత్త సినిమా రిలీజ్కి వున్నంత హంగామా నెలకొంది. టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి.
ఇక, హైద్రాబాద్లో ఓ ధియేటర్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సందడి చేశాడు. తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాని వీక్షించాడు అకీరానందన్.
ముఖానికి మాస్క్ వేసుకుని హీరో లుక్స్లో దర్శనమిస్తున్నాడు. సినిమా ధియేటర్ వద్ద కెమెరాకి చిక్కిన అకీరానందన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.
వారసుడొచ్చాడహో.! అంటూ నెట్టింటి వేదికగా ఈ మెగా ఆరడుగుల ఆజానుబాహుబడి ఫోటోలను వైరల్ చేసేస్తున్నారు పవన్ అభిమానులు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







