‘పవర్’ వారసుడొచ్చాడహో.! అకీరానందన్ ఎంట్రీ.!
- December 31, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు అకీరానందన్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆగండాగండి సినిమాల్లోకి కాదు. న్యూ ఇయర్ సందర్భంగా డిశంబర్ 31న పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘ఖుషీ’ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
విడుదలైన అన్ని ధియేటర్లలోనూ సినిమాకి హౌస్ఫుల్ బోర్డులే. కొత్త సినిమా రిలీజ్కి వున్నంత హంగామా నెలకొంది. టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి.
ఇక, హైద్రాబాద్లో ఓ ధియేటర్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సందడి చేశాడు. తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాని వీక్షించాడు అకీరానందన్.
ముఖానికి మాస్క్ వేసుకుని హీరో లుక్స్లో దర్శనమిస్తున్నాడు. సినిమా ధియేటర్ వద్ద కెమెరాకి చిక్కిన అకీరానందన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.
వారసుడొచ్చాడహో.! అంటూ నెట్టింటి వేదికగా ఈ మెగా ఆరడుగుల ఆజానుబాహుబడి ఫోటోలను వైరల్ చేసేస్తున్నారు పవన్ అభిమానులు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







