‘పవర్’ వారసుడొచ్చాడహో.! అకీరానందన్ ఎంట్రీ.!
- December 31, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు అకీరానందన్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆగండాగండి సినిమాల్లోకి కాదు. న్యూ ఇయర్ సందర్భంగా డిశంబర్ 31న పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘ఖుషీ’ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
విడుదలైన అన్ని ధియేటర్లలోనూ సినిమాకి హౌస్ఫుల్ బోర్డులే. కొత్త సినిమా రిలీజ్కి వున్నంత హంగామా నెలకొంది. టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి.
ఇక, హైద్రాబాద్లో ఓ ధియేటర్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సందడి చేశాడు. తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాని వీక్షించాడు అకీరానందన్.
ముఖానికి మాస్క్ వేసుకుని హీరో లుక్స్లో దర్శనమిస్తున్నాడు. సినిమా ధియేటర్ వద్ద కెమెరాకి చిక్కిన అకీరానందన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.
వారసుడొచ్చాడహో.! అంటూ నెట్టింటి వేదికగా ఈ మెగా ఆరడుగుల ఆజానుబాహుబడి ఫోటోలను వైరల్ చేసేస్తున్నారు పవన్ అభిమానులు.
తాజా వార్తలు
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!







