మస్కట్ లో మరిన్ని పెయిడ్ పార్కింగ్ జోన్లు
- January 02, 2023
మస్కట్: 2023 జనవరి 1 నుండి నగరంలో పెరుగుతున్న పట్టణీకరణ, జనాభా సాంద్రతకు అనుగుణంగా మస్కట్లోని కొన్ని ప్రాంతాలను పెయిడ్ పార్కింగ్ జోన్లుగా మారుస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. మస్కట్లోని పబ్లిక్ పార్కింగ్ స్థలాల వినియోగాన్ని నియంత్రించే పరిపాలనా నిర్ణయం 151/2016 ప్రకారం.. రువీలోని కార్మిక మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ భవనం సమీపంలోని పార్కింగ్ స్థలాలు పెయిడ్ పార్కింగ్ జోన్ గా మారింది. అలాగే, అల్ ఖౌద్ సౌక్ వద్ద కొత్త కార్ పార్కింగ్లు, ఆ ప్రాంతంలోని ఊరేడూ స్టోర్ వెనుక ఉన్నవి కూడా పెయిడ్ పార్కింగ్ గా మార్చారు. లబ్ధిదారులు కారు నంబర్, కోడ్, అవసరమైన సమయ వ్యవధి (30 నుండి గరిష్టంగా 300 నిమిషాలు) కలిగి ఉన్న 90091కి SMS పంపడం ద్వారా SMS ద్వారా పార్కింగ్ను రిజర్వ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాత లబ్ధిదారుడు టిక్కెట్ నంబర్, కారుతో కూడిన నిర్ధారణ SMSను అందుకుంటారని మున్సిపాలిటీ తెలిపింది. లబ్ధిదారుడు కాలవ్యవధిని పొడిగించవలసి వస్తే, అదే దశలను అనుసరించి అతను/ఆమె 90091కి మరొక SMS పంపాలని సూచించారు. వినియోగదారులు బలాదియేటి యాప్ని ఉపయోగించి గంటల తరబడి కార్ పార్కింగ్ని రిజర్వ్ చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే పార్కింగ్ పర్మిట్ని పొందవచ్చని, పునరుద్ధరించవచ్చని లేదా దాని గురించి విచారించవచ్చు లేదా జరిమానాలు చెల్లించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









